వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ దంపతులకు సన్మానం, వస్త్రాల పంపిణీ ఎన్ఆర్పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల గర్ల్స్ హైస్కూల్ వద్ద ఏప్రిల్ 26వ తేదీ నుండి ప్రారంభమైన ఉచిత మజ్జిగ చలివేంద్రం శనివారం 50వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శీరాం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మజ్జిగ పంపిణీలో ప్రతి రోజు క్రియాశీలంగా పాల్గొన్న దంపతులను, వాకింగ్ సభ్యులను సన్మానించారు. సేవాభావాన్ని గుర్తించగా, దంపతులకు నూతన వస్త్రాలు, స్వీట్ బాక్స్లు అందజేశారు. ఈ కార్యక్రమం కోసం మొత్తం రూ.1,50,000 ఖర్చు చేసినట్టు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ, సభ్యులు చారగుళ్ళ గురుప్రసాద్, నారాయణమూర్తి, అమరా బుల్లిబాబు, కాటమరాజు, రమణారావు, బ్రహ్మానందం, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాధాకృష్ణ, ఏడుకొండలు, వీరాంజనేయులు, రఘు తదితరులు పాల్గొన్నారు.
వ్యాపార రంగాల్లో ప్రతిభ ఘన పరిచిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం మహిళ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రధానం చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని చీరాల మేరీ క్రిస్టియన్ పేటకు చెందిన శ్రీమతి గాలంకి మేరీ కి వెస్టేజ్ కంపెనీకి కి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను తనదైన శైలిలో కొనసాగించి అధిక రాబడులు తెచ్చేందుకు కృషిచేసిన మేరీకి డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్ లెన్సీ అవార్డును కేంద్ర మంత్రి స్మృతీఇరాని చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో కష్టపడితే అవార్డు లు ప్రతి ఒక్కరిని వరిస్తాయని అవార్డు గ్రహీత మేరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె తోటి ఉద్యోగులు టీం మెంబెర్స్ ఆమెకు అభినందనలు తెలియజేశారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు – 2025 కృష్ణా రెడ్డికి ప్రదానం చీరాల, ఏప్రిల్ 2025: నిరంతరమైన నిబద్ధత, నిజాయితీ, ప్రజల పక్షాన గళమెత్తే ధైర్యంతో తన విలేఖరి వృత్తిని నడిపిస్తూ, సమాజంలో నిజాన్ని వెలుగులోకి తీసుకురావడంలో విశేష కృషి చేసిన సాక్షి టీవీ చీరాల విలేఖరి శ్రీ కృష్ణా రెడ్డి తాజాగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు 2025ను అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమం ప్రముఖ సేవా సంస్థ కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు హాజరయ్యారు. అవార్డు కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న శ్రీమతి వి. వెంకట అశ్విని ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. * అవార్డు గ్రహీత కృషిపై ప్రశంసలు.. కృష్ణా రెడ్డి పలు సంవత్సరాలుగా తన వృత్తిపరమైన విలేఖరిత్వం ద్వారా సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముందుండారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా హక్కులు, విద్య, ఆరోగ్య సదుపాయాల కొరత, రైతుల సమస్యలు వంటి అంశాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకెళ్ల...
Comments
Post a Comment