మోటారు దొంగలు అరెస్టు
పంట పొలాల్లో నీటి మోటార్లను దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఎట్టకేలకు బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు వద్ద నుండి లక్ష రూపాయిలు విలువ చేసే ఐదు మోటార్లను పోలీసులు స్వాదినం చేసుకున్నారు.చీరాల మండలం కావూరిపాలెం గ్రామంలోని పంట పొలాల్లో అదే గ్రామానికి చెందిన అక్కాల గోపిరెడ్డి, కావూరి గోపిరెడ్డి లు చెడు వ్యాసనాలకు బానిసలు అయ్యి వ్యవసాయ పొలాల్లోని నీటి మోటార్ల ను దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో నిందితులు నేరాన్ని ఒప్పుకోవడం జరిగిందని నిందితులను కోర్టులో హాజరుపరిచనున్నట్లుగా ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Post a Comment