సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన
నేరాల నియంత్రణలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా చీరాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సైబర్ క్రైమ్ వంటి నేరాల భారిన పడకుండా ఉండేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. డీఎస్పీ మొహమ్మద్ మోయిన్, సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Post a Comment