Posts

Showing posts from April, 2025

కృతి ఫౌండర్ అశ్విని ఆధ్వర్యంలో పురస్కారాలు

Image
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు – 2025 కృష్ణా రెడ్డికి ప్రదానం చీరాల, ఏప్రిల్ 2025: నిరంతరమైన నిబద్ధత, నిజాయితీ, ప్రజల పక్షాన గళమెత్తే ధైర్యంతో తన విలేఖరి వృత్తిని నడిపిస్తూ, సమాజంలో నిజాన్ని వెలుగులోకి తీసుకురావడంలో విశేష కృషి చేసిన సాక్షి టీవీ చీరాల విలేఖరి శ్రీ కృష్ణా రెడ్డి తాజాగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు  2025ను అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమం ప్రముఖ సేవా సంస్థ కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు హాజరయ్యారు.  అవార్డు కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్రీమతి వి. వెంకట అశ్విని ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. * అవార్డు గ్రహీత కృషిపై ప్రశంసలు.. కృష్ణా రెడ్డి పలు సంవత్సరాలుగా తన వృత్తిపరమైన విలేఖరిత్వం ద్వారా సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముందుండారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా హక్కులు, విద్య, ఆరోగ్య సదుపాయాల కొరత, రైతుల సమస్యలు వంటి అంశాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకెళ్ల...

వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198 జయంతి వేడుకలు

Image
మహాత్మ జ్యోతి రావు పూలే 198వ జయంతి సందర్భంగా చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు ఆదేశాలతో నాయకులు ఆధ్వర్యంలో చీరాల పట్టణంలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, చీరాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సాధు రాఘవ,కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరియు నాయకులు పాల్గొన్నారు.

చీరాల నుండి అమరావతికి బస్సు కావాలని వినతి

Image
చీరాల నుండి అమరావతి సచివాలయానికి,హైకోర్టుకు వెళ్లడానికి వీలుగా బస్సు సౌకర్యం కల్పించాలని  నేతాజీ సేవా సమితి ప్రతినిధులు సోమవారం చీరాల ఆర్టీసీ డి.ఎం శ్యామలకు వినతి పత్రం సమర్పించారు.ప్రస్తుతం చీరాల నుండి సచివాలయానికి లేదా హైకోర్టుకు వెళ్లాలంటే మంగళగిరి లేదా గుంటూరు వెళ్లాల్సి వస్తుందన్నారు.చీరాల ప్రజలకు ఇది అసౌకర్యంగా ఉన్నందున నేరుగా బస్సు ఏర్పాటు చేయాలని కోరగా ఆర్టీసీ డిఎం సానుకూలంగా స్పందించారు